Saturday, February 4, 2012

నవంబర్ ౧౪, ౨౦౧౦


౨౦౧0 నవంబర్ ౧౪ తేదీ శ్రీ పిళ్ళా రమణ మూర్తి గారి ఆహ్వానం మేరకు విశాఖ లోని సంస్కృత అధ్యాపకులందరూ ద్వారకానగర్ లోని భారతీయ విద్యా కేంద్ర కళాశాలలో సమావేశమయ్యారు. రోజు ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖ విభాగం ఏర్పడిందని అందరి హర్షధ్వానాల నడుమ ప్రకటించడం జరిగింది.

శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు గౌరవ అధ్యక్షులుగా..
శ్రీ పూర్ణచంద్ర రావు గారు గౌరవ ఉపాధ్యక్షులుగా...
శ్రీ శ్రీరాములు నాయుడు గారు గౌరవ సలహాదారుగా...

శ్రీ పెన్మెత్స పెద్ది రాజు గారు అధ్యక్షులుగా...
శ్రీ మూడడ్ల ఉమామహేశ్వర రావు గారు ఉపాధ్యక్షులుగా...
శ్రీ జే. ఎస్. ఆర్. ఎన్. వర్మ గారు కోశాధికారిగా...
శ్రీ గౌరీ నాయుడు గారు సహాయ కోశాధికారిగా...
శ్రీ జి. మన్మథ రావు గారు కార్యదర్శిగా...
శ్రీ ఎం. కామేశ్వర రావు గారు సహాయకార్యదర్శిగా...
శ్రీమతి హరిప్రియ గారు మహిళాకార్యదర్శిగా...
శ్రీ యస్. వి. యస్.యన్. యన్. మూర్తి గారు కో-ఆర్డినేటర్ గా...
శ్రీమతి జ్యోతిర్మయి గారు మహిళా కో-ఆర్డినేటర్ గా...
శ్రీ శ్రీనివాస కృష్ణ గారు కార్య నిర్వాహకులు గా...
శ్రీ జి. సత్యం గారు, శ్రీ ఎ.వి.యస్.ప్రకాష్ గారు, శ్రీ ఇరుకు విద్యాసాగర్ గారు సలహాదార్లుగా ఉండేందుకు అంగీకరించారు.

విజయవాడ అధ్యాపక సంఘం వారు తమ శుభాకాంక్షలను తెలియజేశారు.
విశాఖ సంస్కృత అధ్యాపక సంఘం వారు వివిధ కార్యక్రమాలకు సమావేశం అయ్యేందుకు గాను ఐదవ జాతీయ రహదారి పై ఉన్న భారతీయ విద్యాభవన్ ను ఉపయోగించుకొనవచ్చునని శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు వరం ప్రసాదించేశారు.

...


No comments:

Post a Comment